ముంబై వీధుల్లో కోహ్లీ, అనుష్క చెక్కర్లు.. వీడియో వైరల్

-

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఎవరు గుర్తుపట్టకుండా ముఖాలకు హెల్మెట్లు ధరించి వీరిద్దరూ ముంబై నగరంలో సరదాగా తిరిగారు. గత కొద్ది కాలంగా ఫామ్ లేమి తో సతమతమవుతున్న కోహ్లీ కొంతకాలం విరామం తీసుకుని ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్నాడు. అయితే శనివారం ఓ యాడ్ షూట్లో పాల్గొన్న అనంతరం వీరిద్దరూ ముంబైలోని మధ్ ఐలాండ్లో స్కూటీపై తిరుగుతూూ కనిపించారు.

ఇద్దరూ బ్లాక్ హెల్మెట్ ధరించి ఎవరికంటాా పడకుండా ఉండేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అభిమానుల కెమెరాల నుంచి తప్పించుకోలేకపోయారు. విరాట్ స్కూటీ నడుపుతుండగా అనుష్క వెనకాల కూర్చుంది. ఈ వీడియోను అభిమానులు వారి ఫోన్లలో చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news