ఏపీ టెన్త్ విద్యార్థులకు శుభవార్త..పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

-

ఏపీ టెన్త్ విద్యార్థులకు శుభవార్త. టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి వెల్లడించారు. SSC, OSSC వోకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు ఈ తేదీలోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజులు చెల్లించవచ్చు.

₹50 ఫైన్ తో డిసెంబర్ 25 నుంచి 29 వరకు, ₹200 తో డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు, ₹500 ఆలస్య రుసుముతో జనవరి 4 నుంచి 9 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version