బిజెపి క్షుద్ర పూజలు చేస్తే.. కెసిఆర్ యాగాలు చేస్తారు – తమ్మినేని

-

రాజగోపాల్ రెడ్డి కమ్యూనిస్టులపై అనేక అఘాయిత్యాలు చేశారని ఫైర్ అయ్యారు తమ్మినేని వీరభద్రం. క్షుద్రపూజలు, మనుధర్మం ..చరిత్ర మార్పు చేయడం మొదలు పెట్టింది బీజేపీనే…కేసీఆర్ యజ్ఞాలు..యాగాలు చేస్తారు అంతే అని చెప్పారు తమ్మినేని వీరభద్రం. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండగానే బీజేపీ తో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆరోపణలు చేశారు.

మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మినేని…18000 కోట్లు నిధులు ఇస్తే విత్ డ్రా చేస్తారా అని నిలదీశారు. దేశ అభివృద్ధికి నిధులు ఇస్తున్న అని మోడీ చెప్తున్నారు అయితే మీరు విత్ డ్రా చేసుకుంటారా..? నిధులు ఇస్తే అనే మాటలు .. బీజేపీ తో లూజ్ నెస్ ఉంటుంది అనే భావన వస్తుందన్నారు. బలహీనత మాటల్లో కనపడుతుంది..దాన్ని మేము తప్పుపడుతున్నామని చెప్పారు. జగదీష్ రెడ్డి అంటే ఏదో అన్నారు లే అనుకోవచ్చు..కేటీఆర్ కూడా అలాంటి మాటలు మాట్లాడటం సరికాదు..నిధులు ఇస్తే వైఖరి మార్చు కుంటారా..? అని మండిపడ్డారు తమ్మినేని వీరభద్రం.

Read more RELATED
Recommended to you

Latest news