గుంటూరు జిల్లా తెనాలిలో భార్యని దారుణంగా హత్య చేసిన భర్త

-

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కోటేశ్వర రావు అనే వ్యక్తికి స్వాతి అనే మహిళతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వాతి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మాలని.. తనకి బాకీలు ఉన్నాయని భర్త కొద్ది రోజులుగా భార్యని విసిగిస్తున్నాడు.

ఈ క్రమంలోనే నేడు బ్యూటీ పార్లర్ లో ఉన్న స్వాతి పై ఒక్కసారిగా దాడి చేశాడు భర్త కోటేశ్వరరావు. భార్య స్వాతిని కత్తితో అత్యంత దారుణంగా పొడిచాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇక ముందే తనతో తెచ్చుకున్న పూలదండను భార్య మృతదేహం పై వేసి నివాళి అర్పించాడు కోటేశ్వరరావు. అనంతరం తెనాలి రూరల్ పిఎస్ లో కోటేశ్వరరావు లొంగిపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version