అంబర్ పేట్ నారాయణ కళాశాల ఘటనపై దర్యాప్తు ముమ్మరం

-

హైదరాబాదులోని అంబర్ పేట్ నారాయణ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. ఏకంగా ప్రిన్సిపల్ గదిలోనే ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఒంటిపై మంటలు ఉండగానే ఆ విద్యార్థి ప్రిన్సిపల్ ని కూడా
పట్టుకున్నాడు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కాలేజీ ఫీజు కట్టే విషయంలో ప్రిన్సిపల్ కు విద్యార్థికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గాయపడ్డ వారికి ఆర్డిఓ అపోలో అతుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థి నేత సందీప్, ఏవో అశోక్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. మరో విద్యార్థి నేత వెంకటాచారికి సైతం 30 శాతం గాయాలయ్యాయి. కళాశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు పోలీసులు. అలాగే సీసీ కెమెరా, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news