రాష్ట్రాన్ని బుద్ధిలేని నాయకత్వం పాలిస్తుంది: సోము వీర్రాజు

-

వైసీపీ ప్రభుత్వం పై ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస నిర్వాసితుల గ్రామాల్లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో కూడా ప్రాజెక్టు నిర్వాసితులు ఉన్నారని చెప్పారు. మడ్డువలస రిజర్వాయర్ నిర్వాసితులకు తో పాటు అన్ని నిర్వాసిత గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

తోలు మందం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇసుక, చెరువులో మట్టి ని కూడా అమ్ముకొని సంపాదించుకుంటోంది అని విమర్శించారు. రాష్ట్రాన్ని బుద్ది లేని నాయకత్వం పాలిస్తుంది అని చెప్పారు. రాష్ట్రంలో కొందరు నేతలు పాదయాత్రలు చేసి రోడ్లన్నీ అరిగిపోయేలా చేశారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version