జగన్ తోనే తమ ప్రయాణం :మార్గాని భరత్

-

రాబోయే మూడు-నాలుగు నెలల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తీరు, పరిస్థితి గురించి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు తెలుస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాలను పైకి తీసుకురావడానికి జగన్ కృషి చేశారని చెప్పారు.

ప్రజలు ఎలా ఆలోచించి ఓటు వేశారో తమకు అంతు పట్టడం లేదని ,రాజమండ్రి ప్రజలు తన కుటుంబ సభ్యులు అనుకున్నానని అన్నారు. ఇక్కడ అద్భుతమైన అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. ప్రజల నిర్ణయం బాధాకరంగా ఉందని అన్నారు. ఇప్పుడు శిలాఫలకాలను ధ్వంసం చేస్తే ప్రయోజనం ఏముంటుందని మార్గాని భరత్ నిలదీశారు.అమరావతి ఉద్యమంలో నిజమైన రైతులు పాల్గొనలేదని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలు హామీలను అమలు చేయాలని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని చెప్పారు. వైఎస్ జగన్ తోనే తమ ప్రయాణం ఉంటుందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version