ఓటు వేయడానికి వెళ్తున్నారా ? వైరస్ సోకుతోంది జాగ్రత్త !

-

తెల్లవారితే తెలంగాణాలో 119 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోటీలో గెలవడానికి గత కొన్ని రోజులుగా అన్ని పార్టీలు చాలా కష్టపడి ప్రచారంలో పాల్గొన్నాయి. రేపు ఉదయం పోలింగ్ జరగనుండగా , డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక రేపు ఓటు వేయడానికి వెళ్లే వారికి ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుసుకోవాలిసిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణాలో మళ్ళీ కరోనా కేసులు ఒక్కొక్కటిగా నమోదు అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం నిన్న హైదరాబాద్ లో ఒక్క కేసు నమోదు అయింది. ఇక ఈ రోజు కూడా ఒకరికి పాజిటివ్ గా తేలినట్లు రిపోర్ట్స్ అందుతున్నాయి. ప్రస్తుతం చూస్తే రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఇక రేపు పోలింగ్ ఉండడంతో దగ్గర దగ్గ జనసంచారం ఉండాల్సి రావడంతో వైరస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

ఇక రాష్ట్రంలో చాలా మంది ఫ్లూ తో బాధపడుతున్నారు.. కాబట్టి రేపు ఓటు వేయడానికి వచ్చే వారు ఖచ్చితంగా మార్క్ మరియు శానిటైజర్ వదలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version