యాదాద్రి పవర్ ప్లాంట్ ఆపేందుకు కుట్ర జరుగుతుంది – మంత్రి జగదీష్ రెడ్డి

-

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ ఎన్జీటీ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. పవర్ ప్లాంట్ ను ఆపేందుకు ఏదో కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణం మొదలు పెట్టామని చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( ఎన్జీటీ) తీర్పు ఏకపక్షంగా ఉందన్నారు.

ఎన్జీటీ తీర్పు యావత్ దేశానికి నష్టం కలిగించేలా ఉందన్నారు. దీనివల్ల యావత్ దేశానికి కూడా నష్టమన్నారు. వేలకోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేపట్టిన తర్వాత పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. ఎక్కడో ఉన్న ముంబై సంస్థకు యాదాద్రి పవర్ ప్లాంట్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. గతంలో ఇదే ముంబై సంస్థ కేసు వేసినప్పుడు ఎన్జిటి కొట్టి వేసిందని.. ఇప్పుడు మళ్లీ కేసు వేసిన ముంబై సంస్థ వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version