కుప్పంలో ఈ కుళ్ళు రాజకీయాలు నిలబడవు – చంద్రబాబు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా మరోసారి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై దాడులా..? ఇదేం రాజకీయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో కొత్త సంస్కృతి కోసం వైసీపీ విఫలయత్నం చేస్తోందన్నారు. దాడులు, కేసులు,  వేధింపులతో ప్రశాంత కుప్పంలో కక్ష, ఫ్యాక్షన్ రాజకీయాలను తేవాలని విశ్వ ప్రయత్నం చేస్తోందన్నారు. వైసీపీ కుట్రకు కొందరు పోలీసులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారని మండిపడ్డారు.

 

స్వచ్ఛమైన కుప్పంలో ఈ కుళ్ళు రాజకీయాలు నిలబడవు.. ఈ చర్యలకు తెలుగుదేశం తడబడదన్నారు చంద్రబాబు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ పై కూడా దాడి చేయాలనే ఆలోచన చేసిన రాజకీయ నేతలు మన దగ్గర అధికారంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న అన్న క్యాంటీన్ పై వైసీపీ గుండాలు దాడి చేస్తుంటే పోలీసులు అడ్డుకోలేకపోవడం చాలా దారుణమన్నారు. పోలీసు అధికారులు ఇలాగే అచేతనంగా ఉంటే కష్టమన్నారు. ఈ వైసీపీ రౌడీ మూక రేపు డీజీపీ ఛాంబర్లోకి వెళ్లి పోలీస్ బాస్ టోపీ ఎత్తుకెళ్లినా ఆశ్చర్యం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news