Hyderabad : ఫ్రెండ్ బర్త్ ​డేకు వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం

-

స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకల కోసమని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. దీంతో అదృశ్యమైన ఓ బాలిక, ఇద్దరు యువతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరుమలగిరి ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక తన ఇద్దరు స్నేహితులైన అసీనా, అఖీనా అనే ఇద్దరు యువతులతో కలిసి నిన్న సాయంత్రం బయటకు వెళ్లింది. రాత్రి అయినప్పటికీ వారి తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులు, తెలిసిన వారి వద్ద కుటుంబసభ్యులు, బంధువులు ఆరా తీసినా ఫలితం లేకపోయింది.

దీంతో కుటుంబసభ్యులు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి కోసం సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news