తిరుమల లడ్డూ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు!

-

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పును చెప్పింది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, తీర్పు వెలువడటానికి ముందు టీటీడీ తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి కోర్టుకు స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు.

ఇక కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత వాదనలు వినిపించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం ఉందన్నారు.సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు.అయితే,అందులో కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సీబీఐ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.ఇందులో కేంద్రం ఇద్దరిని నామినేట్ చేయనుండగా, రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు , FSSAI నుంచి ఒకరితో దర్యాప్తు బృందం ఉంటుంది.ఇకపై లడ్డూ వ్యవహారంలో పొలిటికల్ డ్రామాలకు అనుమతిని ఇవ్వబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version