టాలీవుడ్ ప్రముఖుల కీలక భేటీ… రేపు సీఎంతో చిరంజీవితో పాటు పలువురు ప్రముఖుల సమావేశం.

-

ఏపీలో టికెట్ ధరలు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీని కోసం టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఏపీ  ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. రేపు 10 తేదీన పలువురు టాలీవుడ్ ప్రముఖుల సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. చిరంజీవి, నాగార్జునతో పాటు రాధేశ్యాం, ట్రిపుల్ ఆర్ నిర్మాతలు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు విడిగా సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ… పలు మార్లు వాయిదా పడింది. నిన్న మంత్రి పేర్ని నాని, సీఎం జగన్ ని కలిసి టికెట్ ధరలు, ప్రదర్శన నిబంధనలను వివరించారు. ఇండస్ట్రీ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తరువాతే.. టికెట్ ధరలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ నివేదికకు తుదిరూపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఏపీలో థియేటర్లలో టికెట్ ధరలు, ఆన్ లైన్ టికెట్ విధానంపై గత కొన్ని నెలలుగా రచ్చ నడుస్తోంది. గతంలో ఇండస్ట్రీ వ్యక్తులు, ప్రభుత్వంలోని మంత్రుల మధ్య దీనిపై విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. అయితే గత నెలలో మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జగన్ ని విడిగా కలిశారు. ఈసమావేశం తరువాత చిరంజీవి మాట్లాడుతూ.. త్వరలోనే అందరికి అనుకూలమైన నిర్ణయం వస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news