రేపు ప్రభుత్వ అధికారిక లాంచనాలతో కృష్ణ అంతక్రియలు

-

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిఎస్ సోమేశ్ కుమార్ ని ఆదేశించారు. అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని నానక్రామ్ గూడా లోని నివాసానికి తరలించారు.

సాయంత్రం వరకు అక్కడే ఉంచి ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియానికి తరలిస్తున్నారు. రేపు ఉదయం అక్కడి నుంచే అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళి అర్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, రాఘవేంద్రరావు తదితరులు కృష్ణ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అక్కడే ఉన్న మహేష్ బాబును ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version