Breaking : నేడు విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు

-

నేడు విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వైసీపీ బీసీ మహాసభ నేపథ్యంలో బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. ఎంజీ రోడ్డుపై రాకపోకలు పూర్తిగా బంద్ చేస్తున్నట్లు తెలిపారు. అంబులెన్సులు ఇతర అత్యవసర వాహనాలకు మినహాయింపు ఉంటుందన్నారు. నగరంలో నుంచి వెళ్లే వాహనాలను కూడా నగరం వెలుపల నుంచే మళ్లింపులు ఉండనున్నాయి.

Traffic diversions for 24 hours from Saturday night on major routes to  Vijayawada - The Hindu

బెంజ్ సర్కిల్ నుంచి కంట్రోల్ రూమ్ వరకు బిసి మహాసభకు వచ్చే వాహనాల తప్పితే ఏ ఇతర వాహనాలకు ఎటువంటి అనుమతి లేదన్నారు. బీసీ మహాసభకు వచ్చేవారి కోసం ప్రత్యేక వాహన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాట్లు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news