బ్రేకింగ్: మహారాష్ట్రలో విషాదం.. 9 మంది సజీవ దహనం..!!

-

మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. చంద్రాపూర్-ముల్ రోడ్డుపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరగడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అజయ్‌పూర్ సమీపంలో డీజిల్ ట్యాంకర్, మొద్దుల లోడు వేసుకుని వెళ్తున్న ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీల్లో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడిక్కడే సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

accident
accident

అయితే, ప్రమాదం జరిగిన గంట సేపు తర్వాత అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. లారీ డ్రైవర్‌తోపాటు కూలీలు మృతి చెందారని, మృతదేహాలను చంద్రాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్డీపీవో అధికారి సుధీర్ నందన్‌వార్ తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై స్పష్టత లేదన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news