రాజ్యసభ సభ్యులుగా టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం

-

రాజ్యసభ సభ్యులుగా టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్ రావు, పార్థసారధిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేటితో రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. దీంతో తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

దీవకొండ దామోదర్ రావు-పార్థసారధిరెడ్డి
దీవకొండ దామోదర్ రావు-పార్థసారధిరెడ్డి

కాగా, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున దీవకొండ దామోదర్ రావు, పార్థసారధి రెడ్డిగా ప్రకటించింది. వీరితోపాటు మరో ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభ సీట్లకు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వారిద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే మిగిలారు. నామినేషన్ గడువు ముగియడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news