కాసేపట్లో కేసీఆర్ కీలక సమావేశం.. కేటీఆర్ పట్టాభిషేక ప్రకటన ?

-

చాలా కాలం తర్వాత ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. నిజానికి ప్రతి రెండేళ్లకు ఒకసారి పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ వస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి రెండు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మళ్ళీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టనున్నట్లు చెబుతున్నారు. అంతేగాక పార్టీ నియమావళి ప్రకారం ప్రతి నాలుగేళ్లకు ఒకసారి పార్టీ అధ్యక్షుడి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది..

ప్రస్తుతం అధ్యక్షుడిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఈ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కూడా ఈ కార్యవర్గ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక కొద్దిరోజులుగా కేసీఆర్ ముఖ్యమంత్రి కానున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ సహా పార్టీ కార్యవర్గంలో అందరికీ ఆహ్వానం వెళ్ళింది. కచ్చితంగా అందరూ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కచ్చితంగా ఈ రోజు ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news