మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు టీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్య యత్నం

-

వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి ముందు టీఆర్ఎస్ నాయకుడు సేవ్యా నాయక్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం చేశారు.కాంగ్రెస్ కౌన్సిలర్ కారు దహనం కేసులో రామ్మోహన్ రెడ్డి తనపై అనవసర నిందలు వేసి.. బద్నాం చేస్తున్నాడంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో కారు దహనానికి తనకు ఏ సంబంధం లేకపోయినా.. తన పేరు పదే పదే ప్రస్తావిస్తూ తన ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించాడంటూ ఆరోపించాడు సేవ్యా నాయక్. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో వారే కారు తగులబెట్టుకొని తన పేరును తప్పుగా ప్రచారం చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడాయన. ఆత్మహత్యకు ప్రయత్నించిన సేవ్యానాయక్ ను స్థానికులు సమీప దవాఖానాకు తరలించారు. పరిస్థితి విషమించడంతో వికారాబాద్ లోని మిషన్ దవాఖానాకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news