ఎన్నికల‌ వేళ ఆ టీఆర్ఎస్ నేత చిక్కుల్లో పడ్డారా

-

ఒకవైపు ఎమ్మెల్సీ పదవీ కాలం గడువు దగ్గర పడుతుండటంతో.. మళ్లీ పొడిగింపు కోసం కోటి ఆశలు పెట్టుకున్నారు ఆ టీఆర్ఎస్ నేత..పదవీకాలం గడువు సమీపిస్తున్న సమయంలో ఎదురైన హఠాత్‌ పరిణామం ఆయనకు గట్టి షాకే ఇచ్చింది. కీలక సమయంలో కుమారుడి వివాదం ఆయన ఆశల్ని చిదిమేసిందా..కుమారుడి రూపంలో వచ్చిన కష్టం తలచుకుని తెగ దిగులు పడుతున్న ఎమ్మెల్సీ పై హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.

బాలసాని లక్ష్మీనారాయణ. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన బాలసాని గత మూడు దశాబ్దాలుగా వివిధ పదవుల్లో కొనసాగుతున్న ఆయన ఇప్పుడు ఊహించని ఇబ్బందుల్లో పడ్డారు. కుమారుడు విజయ్‌ పై కేసు నమోదవ్వడం ఎమ్మెల్సీ బాలసానికి ఇబ్బందిగా మారింది.బాలసాని రాజకీయ నేతే కాదు..కాంట్రాక్టర్‌ కూడా. భద్రాచలం ఏరియాలోని ఇసుక ర్యాంపుల్లో ఆయన చెప్పిందే వేదమని టాక్‌. ఈ వ్యవహారాలన్నీ బాలసాని కుమారుడు విజయ్‌ పర్యవేక్షణలో ఉంటాయని చెబుతారు. అదే ఇప్పుడు వివాదంగా మారిందట. కూసుమంచి మండలంలోని కొక్యాతండాలో రోడ్డుపనుల్లో ఉన్న ఒక గిరిజనుడిపై విజయ్‌ దాడి చేయడం దుమారం రేపింది.

సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు ఆందోళనలు చేపట్టడంతో విజయ్‌పై కేసు పెట్టక తప్పలేదు. అదీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో మరింత రచ్చ అయింది. తండ్రి అధికార పార్టీ ప్రజాప్రతినిధి.. మంత్రి పువ్వాడ అజయ్‌ ఆశీసులు ఉన్నా.. కుమారుడిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడంతో బాలసానికి దిక్కుతోచడం లేదట. కేసు కాకుండా ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని సమాచారం. ఇప్పుడీ కేసే తన రాజకీయ భవిష్యత్‌కు ఎక్కడ ఎసరొస్తుందోనని ఆందోళన చెందుతున్నారట. ఎమ్మెల్సీ పదవి చివరి అంకంలో ఉన్న బాలసాని మళ్లీ రెన్యూవల్ కి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలకు ఎక్కడ గండి పడుతుందోనని ఆందోళనలో ఉన్నారట.

బాలసాని గతంలో టీడీపీలో ఉండేవారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గంలో ఉండటంతో డీసీసీబీ,డీసీఎంఎస్ ఛైర్మన్‌ పదవులు వరించాయి. చివరకు టీడీపీలోనే ఎమ్మెల్సీ అయ్యారు. తుమ్మల టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో ఆయన్ని అనుసరించారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన ఆశీసులతో మరోసారి ఆ పదవి చేపట్టారు. ఎన్నికల్లో తుమ్మల ఓడిపోవడంతో.. మంత్రి పువ్వాడ అజయ్‌ శిబిరంలో చేరారు బాలసాని. ఈ ఏడాది డిసెంబర్‌తో తన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిపోతుంది. ఆ పదవిని మరోసారి పొడిగించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇలాంటి సమయంలో సన్‌ స్ట్రోక్‌ తగలడంతో బాలసానికి మైండ్‌ బ్లాంక్‌ అయిందట.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుపై ఖమ్మం టీఆర్‌ఎస్‌లో చాలా మంది కన్ను పడింది. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. బాలసాని అలాంటి అడ్డంకులను అధిగమించే పనిలో ఉండగా.. ఎదురైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు మనశ్శాంతిని దూరం చేసిందట. అధికార పార్టీలోనూ దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news