పదవులన్నీ మల్లారెడ్డే తీసుకెళ్తున్నారు – టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం

-

పదవులన్నీ మంత్రి మల్లారెడ్డే తీసుకెళ్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదవులన్నీ ఒక్క మేడ్చల్ నియోజకవర్గానికే వెళ్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద, సుభాష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు ఆరోపించారు.


‘మాకెందుకు పదవులు రావట్లేదని కార్యకర్తలు అడుగుతున్నారు. కార్యకర్తలకు న్యాయం జరిగేలా కృషి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. AMC పదవుల్లో అందరినీ కలుపుకుని పోలేదు. జిల్లా పదవులు అన్ని మంత్రి మల్లారెడ్డి ఒక్కరే తీసుకెళ్తున్నారు’ అని వాపోయారు. ఇది రహస్య మీటింగ్‌ కాదు.. కుటుంబంలాంటి పార్టీలో ఎన్నో ఉంటాయి.. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని వారు స్పష్టం చేశారు. మరి ఈ సంఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news