టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం.. హైదరాబాద్ అంతా గులాబీమయం..

-

నేడు టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో… టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి సర్వం సిద్ధం చేశారు టిఆర్ఎస్ నాయకులు. టిఆర్ఎస్ 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇవాళ్ళ హైదరాబాదులోని హెచ్ ఐ సి సి లో ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఆరు నెలల వ్యవధిలోనే మరోసారి నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది టిఆర్ఎస్ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకల్లా టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్లీనరీకి చేరుకుంటారు. ఉదయం 11 గంటల వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్… వేదికపై అమరవీరులకు నివాళులు అర్పిస్తారు.

తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి.. టిఆర్ఎస్ జండా ఆవిష్కరిస్తారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. 21 ఏళ్ల ప్రస్థానం తో పాటు ఉ ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ వివరిస్తూ ప్రసంగాన్ని కొనసాగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news