BREAKING : ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ మంజూరు

-

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒకవిడత డీఏ 2.73 శాతం మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో 2021 జూలై ఒకటో తేదీ నుంచి ఉద్యోగులకు లబ్ది కలగనుంది. ఈ నిర్ణయంతో పెరిగిన డీఏను పెన్షనర్లకు జనవరి పెన్షన్‌తో కలిపి ఫిబ్రవరిలో ఇవ్వనున్నట్టు తెలిపింది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు బకాయిలను ఎనిమిది విడతల్లో చెల్లించనున్నట్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్‌ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సోమవారం (జనవరి 23) విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. జనవరి 27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

జనవరి 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరణ పూర్తవుతుంది. మార్చి 4 నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయనున్నారు. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లోపు అప్పీళ్లను పరిష్కరించనున్నట్లు విద్యాశాఖ తాజా షెడ్యూల్‌లో పేర్కొంది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతులకు అనుమతి ఇచ్చిన రోజుల వ్యవధిలోనే వేగంగా ప్రక్రియ చేపట్టడం విశేషం. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల నిరీక్షణకు తెరదించినట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news