వీలైనంత త్వరగా ఉద్యోగ నియామకాలు: సీఎస్ సోమేశ్ కుమార్

-

వీలైనంత త్వరగా కొత్త ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎం కే చంద్రశేఖర్ రావు భావిస్తున్నారని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బీఆర్‌కే భవన్‌లో కొత్త జోనల్ విధానం అమలుపై సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో జరుగుతున్న ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.

వీలైనంత త్వరగా కొత్త జోనల్ విధానంలో భాగంగా ఉద్యోగుల బదిలీలు, నియామకాల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్ని జిల్లాల కార్యదర్శులను, జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో జోనల్, బహుళ జోనల్ ఉద్యోగులు, అధికారుల బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version