Breaking : ఎస్సై అభ్యర్థులకు శుభవార్త.. ఫలితాలు విడుదల

-

తెలంగాణ ఎస్సై, ఏఎస్సై ఫలితాలు ఆగస్టు 6న విడుదలయ్యాయి. 587 పోస్టులకు 434 మంది పురుషులు, 153 మంది మహిళలను TSLPRB ఎంపిక చేసింది. ఆగస్టు 7న ఉదయం వారి వివరాలను సైట్లో ఉంచుతామని పేర్కొంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి అయిందని వెల్లడించింది. TSLPRB 2022 నోటిఫికేషన్‌కు సంబంధించి 554 ఎస్సై పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా దాదాపు 2.47 లక్షల మంది పరీక్ష రాశారు. గతేడాది ఆగస్టు 7న ప్రాథమిక రాతపరీక్షతో ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైంది.

ఎంపికైన అభ్యర్థుల ప్రవర్తన, క్రిమినల్‌ కేసులపై ఆరా తీసి పది రోజుల్లోనే సెలెక్షన్​ లెటర్లను అభ్యర్థులకు పంపించనుంది. ఆగస్టు రెండోవారంలోగా పోలీసు, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్ల విభాగాలకు సెలెక్షన్​ లిస్ట్ పంపించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.. కాగా, ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉదయం నుంచి వెబ్ సైట్‌లో ఉంచుతామని వెల్లడించింది. మరోవైపు సెప్టెంబర్‌లో కానిస్టేబుల్‌ అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version