సజ్జనార్‌ మరో సంచలన నిర్ణయం.. ఆర్టీసీ బస్సుల్లో పిల్లలకు ఉచిత ప్రయాణం

-

ఆర్టీసీ ఎండీ గా మాజీ ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్‌. అయితే… చిల్ట్రన్స్‌ డే సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పిల్లలలకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చారు.

15 సంవత్సరాల కంటే… తక్కువ వయసున్న పిల్లలకు బస్సుల్లో ఇవాళ టికెట్‌ ఉండదని… ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఉచితంగా ప్రయాణించవచ్చని.. ప్రకటించారు ఆర్టీసీ వీసీ సజ్జనార్‌. ఏసీ, మెట్రో డీలక్స్‌, ఆర్టీనరీ ఇలా ఏ బస్సు అయినా… ఎక్కవచ్చన్నారు. సురక్షితమైన… సుఖ వంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని వీసీ సజ్జనార్‌. ఇక ఎండీ సజ్జనార్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లకు బస్సులు బుక్‌ చేసుకున్న నూతన జంటలకు గిప్ట్‌ లు ఇస్తామని ఇటీవల ఆర్టీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news