శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపే ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

-

తిరుమల : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టిటిడి పాలక మండలి. రేపు ఆన్ లైన్ లో ఫిబ్రవరి మాసానికి సంభందించిన తిరుమల శ్రీవారి దర్శన టిక్కేట్లు విడుదల చేయనుంది టిటిడి పాలక మండలి. ఇందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లు విడుదల చేయనుంది టిటిడి పాలక మండలి.

ప్రతి రోజుకి 12 వేల చోప్పున టిక్కేట్లు విడుదల చెయ్యనున్న టిటిడి పాలక మండలి… ఎల్లుండి సర్వ దర్శనం టోకేన్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. రోజుకి 10 వేల చోప్పున విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. ఇక అటు శ్రీవారి ఆలయంలో ఆధ్యాయనోత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే దర్శనలకు వచ్చే భక్తులు.. 72 గంటల కంటే ముందు కరోనా నెగిటివ్ ఉన్న సర్టిఫికెట్ ను చూపించాలని సూచనలు చేసింది. అలాగే దర్శనల సమయాల్లో.. భక్తులు అందరూ.. కరోనా రూల్స్ పాటించాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news