శ్రీవారి భక్తులకు శుభవార్త.. 9 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శనివారం తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 25 వేల చొప్పున టిక్కెట్లను విడుదల చేయనుంది. శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టిక్కెట్లు విడుదల కానున్నాయి. భక్తులు https://tirupatibalaji.ap.gov.in/వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ తెలిపింది.

TTD starts issuing offline Sarvadarshan tokens, devotees flock to Tirumala  for tickets

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం శ్రీవారిని 67,625 మంది భక్తులు దర్శించుకోగా.. 34,584 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లు తెలిపింది. ఇక 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వీకెండ్ కావడంతో ఈ రద్దీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news