మీడియాతో పవన్ మాట్లాడుతున్న టైంలో పవర్ కట్..జగన్ పై సెటైర్లు

-

ఏపీలో కరెంట్‌ కోతలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. నిన్న ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో చిట్ చాట్ జరుగుతోన్న సమయంలో పవర్ కట్ అయింది. అయితే.. దీనిపై జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సెటైర్లు పేల్చారు. ఏపీ అంధకారంలో ఉందనడానికి ఇదే నిదర్శనమన్న పవన్… చీకట్లోనే మీడియాతో మాట్లాడుతున్నానంటూ పవన్ సెటైర్లు వేశారు.

బీసీలకు ఈ ప్రభుత్వం ఏం మేలు చేసింది..? ఆర్ కృష్ణయ్య మంచి బీసీ నేత అన్నారు. కొన్ని సందర్భాల్లో ఆర్ కృష్ణయ్యను కలిశానని..విభజన తర్వాత ఆర్ కృష్ణయ్యను ఏపీ బీసీలు ఎలా చూస్తారోననేది వేచి చూడాలని వెల్లడించారు.

విభజన తర్వాత తెలంగాణలో ఆంధ్రా కులాలంటూ కొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తప్పించారు.. తెలంగాణలో ఏపీ కులాలని బీసీ జాబితా నుంచి తప్పిస్తున్నప్పుడు.. ఆర్ కృష్ణయ్య దాన్ని తప్పు పట్టారో లేదో నాకు గుర్తు లేదని విమర్శించారు. ఏపీ కులాల పేరుతో బీసీ జాబితా నుంచి తొలగించకుండా చూడాలని అప్పట్లోనే నేను కొందరి తెలంగాణ బీసీ నేతలను కోరానని.. మాకు ఇబ్బంది అవుతుందంటూ తెలంగాణ బీసీ నేతలు ఏం చేయలేకపోయారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news