తిరుమల భక్తులకు అలర్ట్..ఇవాళ 10 గంటలకు టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ 10 గంటలకు తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల కానున్నాయి. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేది వరకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం జరుగనుంది. ఈ తరుణంలోనే.. ఇవాళ ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.

ttd

రోజుకు 22500 చోప్పున పది రోజులుకు 2.25 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల కానున్నాయి.
ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల అవుతాయి. రోజుకు 2 వేలు చొప్పున పది రోజులకు 20 వేల టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇక సాయంత్రం 5 గంటలకు వసతి గదులు కోటా విడుదల కానున్నాయి. ఈ తరుణంలోనే తిరుమల భక్తులందరూ టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version