ట్విట్టర్ కొనుగోలుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆఫర్

-

ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారీ డీల్ ఆఫర్ చేశాడు. ట్విట్టర్ ను కొనబోతున్నట్లు మస్క్ ప్రకటించారు. ప్రపంచ సోషల్ మీడియా ప్లాట్ ఫారామ్ లో ట్విట్టర్ 15వ స్థానంలో ఉంది. స్పెస్ ఎక్స్, టెస్లా సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్ ప్రపంచంలో కుబేరుల జాబితాలో మొదటిస్థానంలో ఉన్నారు. 

ట్విట్టర్ కంపెనీకి చెందిన ఒక్కో షేర్ ను 54.20 డాలర్ల చొప్పున 41 బిలియన్ డాలర్లు వెచ్చింది కొనేందుకు మస్క్ ముందుకు వచ్చారు. ఎప్రిల్ 1తో ముగిసిన ట్రేడింగ్ లో ట్విట్టర్ షేర్ విలువకన్నా ఇది 38 శాతం అధికం. ఇటీవలే మస్క్ ట్విట్టర్ లో కొన్ని షేర్లు కొని వాటాదారుడిగా మారాడు. ఈ ప్రకటనతో ట్విట్టర్ షేర్ల విలువ బుధవారం 12 శాతం పెరిగాయి. ప్రస్తుతం మస్క్ ప్రతిపాదించన డీల్ బెస్ట్ డీల్ గా ఆయన పేర్కొన్నాడు. ఇప్పటికే మస్క్ ట్విట్టర్ లో 9.2 శాతం స్టేక్స్ కలిగి ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version