ఆ నటిని అఖిల్‌ వేధించాడు.. ఉమర్‌ సంధూపై పరువు నష్టం దావా

-

హీరో, హీరోయిన్స్, సెలబ్రిటీల మీద పుకార్లు, అక్కర్లేని వార్తలు, తప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రిటీలు కొంతమంది వాటిని సీరియస్ గా తీసుకొని రియాక్ట్ అవుతుంటే మరికొంతమంది మాత్రం అసలు వాటిని పట్టించుకోరు. తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తనపై, హీరో అఖిల్ పై తప్పుడు వార్తలు రాసిన ఓ సినీ క్రిటిక్ కి లీగల్ నోటీసులు పంపించింది.

Urvashi Rautela 100 crores project spy action thriller agent Mammootty-Akhil  Akkineni look leaked उर्वशी रौतेला के हाथ लगा 100 करोड़ का बड़ा प्रोजेक्ट,  एक्शन-थ्रिलर 'एजेंट' से लीक हुआ ...

తనను తాను విదేశీ సెన్సార్ బోర్డు సభ్యుడ్నని చెప్పుకుంటూ, బాలీవుడ్, టాలీవుడ్ తదితర సినిమాలపై రివ్యూలు ఇస్తుండే ఉమైర్ సంధూపై నటి ఊర్వశి రౌతేలా మండిపడుతోంది.

Also Read : సెటిల్మెంట్ల కోసమే అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు – కౌశిక్ రెడ్డి

ఏజెంట్ సినిమా చిత్రీకరణ సమయంలో ఊర్వశి రౌతేలాను హీరో అక్కినేని అఖిల్ వేధించాడని ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఊర్వశి అభిప్రాయం ప్రకారం అఖిల్ లాంటి హీరోతో పనిచేయడం చాలా కష్టం అని పేర్కొన్నాడు.

Also Read : నోవాటెల్ హోటల్లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ

ఈ మేరకు ట్వీట్ చేయగా, అది కాస్తా వైరల్ అయింది. దాంతో, ఊర్వశి రౌతేలా తీవ్రంగా స్పందించింది. ఉమైర్ ట్వీట్ లో వాస్తవం లేదని, అఖిల్ తనను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని స్పష్టం చేసింది. తన ప్రతినిధులు ఇప్పటికే ఉమైర్ సంధూపై పరువునష్టం దావా వేశారని వెల్లడించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news