బండి సంజయ్ కి బెయిల్ రావడం పై కేంద్ర మంత్రి కిషన్ హర్షం

-

బండి సంజయ్ కి బెయిల్ రావడం పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం చేశారు. అక్రమంగా బనాయించిన కేసు విచారణలో సహకరిస్తామని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మాకు న్యాయవ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. అక్రమ కేసులతో గొంతునొక్కాలని కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తోందన్నారు.

కల్వకుంట్ల కుటుంబ అరాచకాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. BRS పార్టీ ఎన్ని కుట్రలు , కుతంత్రాలు చేసిన ధర్మం న్యాయం ముందు నిలబడవని తెలిపారు. నిరంకుశ విధానాలతో నియంతృత్వ ధోరణితో రాష్త్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version