అమ్మ, చెల్లికే న్యాయం చెయ్యలేని జగన్.. రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తాడు..? : వంగలపూడి అనిత

-

వైసీపీపై మరోసారి టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి, అసమర్థ నాయకుని పాలన ఎలా ఉంటుందో జగన్ ను చూస్తే అర్డంవుతుందని.. వైసీపీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. మహిళల్లో చైతన్యం తెచ్చేందుకే నారీ సంకల్ప దీక్ష చేపట్టామన్నారు.. పాదయాత్రలో తల నిమిరి ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి రాగానే అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్మ,చెల్లికే న్యాయం చెయ్యలేని జగన్.. రాష్ట్ర మహిళకు ఏమి న్యాయం చేస్తారు..? అని నిలదీశారు. నెల్లూరు కు చెందిన పోణకా కనకమ్మ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మహిళా పోరాటం చెయ్యాలని కోరారు. దుబాగుంట రోసమ్మ పోరాట పటిమను అందరూ ప్రదర్శించాలి.. రాష్ట్ర మహిళలు పడుతున్న కష్టాన్ని వివరించేందుకె నెల్లూరు వచ్చానని తెలిపారు.. రాష్ట్ర మహిళల భద్రత తన బాధ్యత అన్న జగన్… మహిళలపై దాడులు జరుగుతూ ఉంటే ఏమి చేస్తున్నారు..? అని ఆగ్రహించారు.

చీప్ లిక్కర్ తాగొచ్చి.. భర్త చేతిలో చావు దెబ్బలు తింటున్న ప్రతి మహిళా చైతన్యం కావాలని కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు.. ఓట్లు అడుక్కునేందుకు త్వరలో పీకే టీమ్ రాబోతుంది.. ప్రభుత్వాన్ని కూడా స్వార్థంతో.. బిజినెస్ మైండ్ తో నడుపుతూ ఉన్నాడని ఆగ్రహించారు. తల్లికి, చెల్లికి విలువ ఇవ్వలేని జగనన్నకు మహిళల సమస్యలు అర్థమవుతాయా..? అని నిప్పులు చెరిగారు. వంటింట్లో ఉన్న మహిళలకు డ్వాక్రా సంఘాలు చంద్రబాబు ఏర్పాటు చేస్తే.. డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news