దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు రావాలి : వంగలపూడి అనిత

-

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఏమైనా, ప్రజలు ఎక్కడకు పోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని వనిత ఆరోపించారు. కోనసీమను చూస్తుంటే పాకిస్థాన్ గుర్తుకొస్తోందన్న వంగలపూడి అనిత.. జగన్ అరాచకానికి కోనసీమ ప్రాంతం మచ్చుతునక అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. అధికారదాహాంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైళ్లు తగలబెట్టించారని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు సొంతపార్టీ ఎమ్మెల్సీని కాపాడుకోవడానికి, మంత్రి ఇంటిని తగలబెట్టిన వారు, రేపు అధికారం కోసం ప్రజల్ని తగలబెట్టరా? అని వనిత ప్రశ్నించారు.

Jagan using mother for cheap politics: TDP

65 మందిని పోలీసులు అరెస్ట్ చేస్తే 45మంది వైసీపీ వారే ఉన్నారని ఆమె ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఆత్మకూరులో దమ్ముంటే పోటీ చేయండి అనేవారికి దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు వనిత. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించండని ఆమె డిమాండ్‌ చేయడమే కాకుండా.. ప్రజల్లోకి వెళ్లి ఎవరి బలం ఎంతుందో తేల్చుకుందామన్నారు. అత్యాచారాలను తేలిగ్గా తీసుకునేవారు ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడతారా..? అని అగ్రహం వ్యక్తం చేశారు వనిత.

 

 

Read more RELATED
Recommended to you

Latest news