యోగాను విశ్వవ్యాప్తం చేసిన ప్రధానికి నా అభినందనలు : వెంకయ్యనాయుడు

-

సికింద్రాబాద్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన యోగా కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. అందరికీ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.. యోగా ఏకాగ్రతకు సంబంధించింది.. యోగా ప్రాచుర్యమైనదన్నారు.

మన పెద్దలు మనకు అందించిన వరం యోగా.. అని.. కులమతాలకు అతీతమైనది యోగా అని వెల్లడించారు. యోగా కాలాతీతమైనది.. కుల,మత, బేధాలు లేకుండా ఎల్లలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది యోగా అని వివరించారు.

యోగాను విశ్వవ్యాప్తం చేసిన ప్రధానికి నా అభినందనలు అంటూ ఎమోషన్‌ అయ్యారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి.. ప్రపంచ శాంతిని ఏర్పరచాలని కోరారు.. యోగాను అందరూ అలవర్చుకోవాలి.. యోగ ఫిజికల్.. మెంటల్ హెల్త్ ని బాగు పరుస్తుంది..అందరూ యోగ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version