పార్టీల ప్రయోగశాలగా తెలంగాణ మారింది – విజయశాంతి

-

పార్టీల ప్రయోగశాలగా తెలంగాణ మారిందని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు విజయశాంతి. కారణాలు ఏవైనా… కేసీఆర్ గారు బీఆరెస్ ఆలోచన ప్రారంభించిన నాటి నుండీ తెలంగాణ రాజకీయాలు ప్రాంతేతర పార్టీల ప్రయోగశాలగా మారుతూ వస్తున్నాయని నిప్పులు చెరిగారు.

 

తెలంగాణ వచ్చినది మొదలు… ఎన్నో వైపరీత్య, విచిత్రాలను తెలంగాణ ప్రజలకు ఎనిమిదేళ్లుగా చూపిస్తూనే ఉన్న కేసీఆర్ గారి మరో సాధన ఇది. ఆయన అత్యాశ ప్రేరేపిత దుర్మార్గ ధోరణికి సమాధానమన్నారు విజయశాంతి. మా ఉద్యమకారుల మరో పోరాటమే కావచ్చు కూడా…ఒక్క మాటలో చెప్పాలంటే… కేసీఆర్ గారు పక్క రాష్ట్రాలకు వెళ్లాలనే ఆశతో… పక్క రాష్ట్రాల పార్టీలు తెలంగాణకు వచ్చే కార్యాచరణ చేస్తున్నారు అని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news