విద్యా వ్యవస్థను ఆగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం : విజయశాంతి

-

మరోసారి కేసీఆర్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. కెసిఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారని, అకడమిక్​ఇయర్ ప్రారంభం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్నా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కెసిఆర్ సర్కార్ విఫలమైందని ఆమె విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండేళ్లుగా విద్యా వలంటీర్ల ను రిక్రూట్​మెంట్​ చేయకపోవడంతో హైస్కూల్​విద్య అస్తవ్యస్తంగా మారింది. విద్యాశాఖ అధికారులు మాత్రం టెన్త్​ స్టూడెంట్లకు స్పెషల్​ క్లాసుల పేరుతో మొక్కుబడిగా యాక్షన్ ప్లాన్ ను రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. అరకొర టీచర్లతో టెన్త్​సిలబస్ కొన్ని సబ్జెక్ట్ లు 60 శాతం పూర్తయినా, టీచర్లు లేని సబ్జెక్ట్ లు ఇంకా స్టార్ట్ కాలేదు.

అకడమిక్ ​ఇయర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక స్కూళ్లల్లో కొన్ని సబ్జెక్టులకు టీచర్లు లేక టెన్త్​స్టూడెంట్లు కనీసం ఆ బుక్స్​కూడా తెరవలేదు. స్టూడెంట్ల పరిస్థితులను అంచనా వేసి టీచర్లను సర్దుబాటు చేయాల్సిన అధికారులు ఆ సంగతే మరిచిపోయారు. ఇలా కెసిఆర్ గారు విద్యా వ్యవస్థను పూర్తిగా ఆగం చేస్తుండు. విద్యార్థుల భవిష్యత్తో ఆడుకుంటున్న ఈ కెసిఆర్ సర్కార్ కు తెలంగాణ ప్రజానీకమే తగిన గుణపాఠం చెబుతారు. అని విజయశాంతి మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version