వికారాబాద్ బాలిక అత్యాచారం, హత్య కేసులో బిగ్ ట్విస్ట్…

-

వికారాబాద్ జిల్లాలో నిన్న పదోతరగతి చదువుతున్న బాలిక దారుణంగా హత్యకు గురైంది. బండరాయితో మోది హత్య చేశారు. హత్యకు ముందు బాలికపై అత్యాచారం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలవం అంగడి చిట్యంపల్లితో ఈ దారుణం చోటు చేసుకుంది. ఉదయం బయటకు వెళ్లిన బాలిక ఎంతకు తిరిగిరాలేదు..చిట్యంపల్లి శివారులో 15 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. అయితే బాలికను తన ప్రియుడే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ కేసుల కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలిక తల్లి లక్ష్మీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసుల విచారణలో ప్రియుడు నోరు మెదపడం లేదు. రాయితో మోది హత్య చేసిన దుండగుల కోసం గాలిస్తున్నారు. పరిగి డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు టీంలు ప్రత్యేకంగా విచారణ చేపడుతున్నారు. పోలీసులు విచారణలో బాలిక తల్లి పొంతనలేని సమాధానాలు చెబుతోందని తెలుస్తోంది. హత్యను ఉద్దేశపూర్వకంగా ప్రియుడిపై మోపే ప్రయత్నం చేస్తుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో ప్రియుడు పాత్ర ఉందా..? లేక తల్లి పాత్ర ఎంత ఉందనేదానిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news