కమల్ హాసన్ ‘విక్రమ్’ రన్ టైమ్ లాక్‌డ్..థియేటర్లలో సందడే సందడి

-

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ఈ ఏడాది జూన్ 3న విడుదల కానుంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. కొచ్చిలో కమల్ హాసన్ ఈ సినిమా ప్రమోట్ చేసేందుకు బయల్దేరారు.

ఈ పిక్చర్ లో కమల్ హాసన్ తో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోలు నటించారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫజిల్, సూర్య కీలక పాత్రలు పోషించారు. సూర్య పాత్ర చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ చక్కటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ చెప్తున్నారు.

వెరీ డిఫరెంట్ స్టోరిని యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ చక్కగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సినిమా నిడివిని మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. 173 నిమిషాలు అనగా..2 గంటల 53 నిమిషాల నిడివితో ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

లోకేశ్ కనకరాజ్ గత చిత్రం ‘మాస్టర్’ కూడా ఇంతే నిడివితో విడుదలై సక్సెస్ అయింది. తెలుగులో ఈ చిత్రాన్ని యంగ్ హీరో నితిన్ ప్రజెంట్ చేస్తు్న్నారు. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈ పిక్చర్ ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news