ఈటల, హరీష్‌ రావుల మధ్య చిచ్చు పెట్టింది కేటీఆరే : వివేక్‌

-

మంత్రి కేటీఆర్‌పై మాజీ ఎంపీ వివేక్‌ సంచలన ఆరోపణలు చేశారు. టీఆరెఎస్ ఎక్కడ ఓడిపోతాదో కెటిఆర్ అక్కడ ఉండడని… ఈటల రాజేందర్ , హరీష్ రావు ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది కెటిఆర్ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివేక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయం తో ఏదో ఒకటి చెప్పలని కెటిఆర్ చెప్తున్నారని… సుమన్ భాష మార్చుకోవాలని తెలిపారు.

మొనగాడు ఎవరో సిఎం కేసీఆర్ ను అడిగితే చెప్తాడని… మేము కాంగ్రెస్ లో ఎందుకు పోతాం.. బిజెపి బలోపేతానికి పని చేస్తామన్నారు.. దళితులను ముఖ్యమంత్రి తో పాటు మూడెకరాల భూమి ఇతర హామీలు ఇచ్చింది కేసీఆర్ అని… ఏడు సంవత్సరాల పాలన అప్పుల పాలనగా మారిందని మండిపడ్డారు.

దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఇస్తే ఇప్పుడు దీని విలువ 60 లక్షలు అయిందని… సిఎంఓ అఫీస్ లో ఒక్క దళిత అధికారి ఎందుకు లేడని ప్రశ్నించారు. గత నాలుగు నెలల నుండి దళిత బంధు డబ్బులు అన్ని దళిత కుటుంబాలకు డబ్బులు ఇవ్వాలని కోరింది బిజెపి పార్టీ అని చెప్పారు. దళిత బంధు డబ్బులు అకౌంట్ లలో వేసామని ఫ్రిజ్ చేసింది టీఆరెఎస్ ప్రభుత్వం అన్నారు. ఎన్నికల సమయం లో ఎన్నికల కమిషన్ దళిత బంధు ఆపుందని… టీఆరెఎస్ కు ముందే తెలుసు అన్నారు వివేక్‌.

Read more RELATED
Recommended to you

Latest news