బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’

-

ఈ సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేర్‌ వీరయ్య’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స నిర్మించిన ఈ చిత్రంలో, మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం జ‌న‌వ‌రి 13న రిలీజైంది. తొలి వారంలోనే సినిమా లాభాల బాట పట్టింది. ఎనిమిది రోజుల్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.175 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుంది. షేర్ కలెక్ష‌న్స్ ప్ర‌కారం చూస్తే ఇది రూ.102 కోట్లు అని చెబుతున్నారు. ఇక సినిమా రెండో వారంలోకి అడుగు పెట్టింది. సాధార‌ణంగా రోజులు గ‌డిచే కొద్ది క‌లెక్ష‌న్స్ డ్రాప్ అవుతుండ‌టం అనేది సాధార‌ణ‌మైన విష‌య‌మే. అయితే.. షారూఖ్ ఖాన్ ప‌ఠాన్ సినిమా రిలీజ్ వ‌ర‌కు ‘వాల్తేరు వీరయ్య’కు తిరుగులేదు. సినిమాకున్న పాజిటివ్ బ‌జ్ కార‌ణంగా.. వ‌సూళ్లు పెరిగాయి.

8వ రోజు ‘వాల్తేరు వీరయ్య’కి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కంటే 9వ రోజు అంటే శ‌నివారం వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. 8వ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.4.70 కోట్లు వ‌చ్చాయి. అయితే 9 వ‌రోజు ఎక్కువ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. రూ.5.56 కోట్లును ‘వాల్తేరు వీరయ్య’ 9వ రోజు వ‌సూలు చేసింద‌ని అంటున్నారు. శ‌నివారం వీకెండ్ కావ‌టంతో క‌లెక్ష‌న్స్ పెరిగాయ‌ని టాక్‌. ఇక ఆదివారం కూడా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు ఎక్కువ క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news