యువతిని గదిలో బంధించి రేప్​ చేసిన వాచ్​మెన్

-

జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచార ఘటన మరువకముందే బంజారాహిల్స్‌లో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని గదిలో బంధించి కాపలాదారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 4న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బంజారాహిల్స్‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న చిన్మయి సైక్యా(22)తో పరిచయం ఏర్పడింది. యువతిపై కన్నేసిన అతడు ఈ నెల 4న ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బయటకు చెబితే చంపుతానంటూ బెదిరించాడు.

ఈ దారుణాన్ని జీర్ణించుకోలేక.. మరుసటి రోజు ‘తనకు చనిపోవాలని ఉందంటూ’ స్నేహితురాలికి చరవాణిలో సంక్షిప్త సందేశం పంపింది. ఆమె బాధితురాలి సోదరికి చెప్పటంతో ఈ దారుణం బయటపడింది. బాధితురాలి సోదరి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బంజారాహిల్స్‌ సీఐ ఎం.నరేందర్‌ తెలిపారు. నిందితుడు చిన్మయి సైక్యాను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version