భర్తను చంపేసి.. రక్తపు మడుగులో అతడి పక్కనే నిద్రించిన భార్య

-

మద్యం మత్తులో వేధిస్తున్నాడని.. నిద్రిస్తున్న భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. రక్తపు మడుగులో గిలగిల కొట్టుకొని ప్రాణాలు విడిచిన భర్త పక్కనే నిద్రించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

death

నానాజీపూర్‌కు చెందిన ఒల్కే రాజు(40), జ్యోతి దంపతులు. వీరికి పదేళ్ల లోపు కుమారుడు, కూతురు ఉన్నారు. దినసరి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా రాజు మద్యానికి బానిసయ్యాడు. పనులకు వెళ్లకుండా జులాయిగా తిరగడమే కాకుండా భార్య ప్రవర్తనను అనుమానిస్తున్నాడు. భార్యతో రాజు నిత్యం గొడవ పడేవారు. దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా తీరు మారలేదు. శనివారం రోజున మద్యం మత్తులో రాజు.. తన పిల్లలతో పాటు భార్యపై దాడి చేశాడు.

రాజు ప్రవర్తనతో విసిగిపోయిన జ్యోతి.. గాఢనిద్రలో ఉన్న సమయంలో రాజుపై కత్తితో దాడి చేసి హతమార్చింది. ఆ తర్వాత అతడి పక్కనే నిద్రపోయింది. ఉదయం ఎప్పటిలా ఇంటి పనులు చేసిన ఆమె.. 8 గంటలకు భర్త ఉరేసుకొని చనిపోయాడని విలపిస్తున్నట్లు నటించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భార్యపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి బయటపడింది. తండ్రి మృతి చెందడం, తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో చిన్నారులు విలపించిన తీరు స్థానికులను కలిచివేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version