చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీటింగ్ జరుగుతుందా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఇచ్చిన హామీలపై చర్చించేందుకు తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈనెల ఆరవ తేదీన భేటీ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది.అయితే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీపై తెలంగాణ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలవాలని తాము కోరుకుంటున్నామని, కానీ వారిద్దరి భేటీ ఏ క్షణంలోనైనా రద్దు కావొచ్చని ఎన్వీఎస్ ప్రభాకర్ వెల్లడించారు.

విభజన చట్టంలోని హామీలు ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని ముందుకు వెళ్తే మంచిదేనని, అయితే చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీటింగ్‌కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పర్మిషన్ ఉందా అని ఆయన ప్రశ్నించారు. అసలు ఆ మీటింగ్ జరుగుతుందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఏదో ఒక కారణం చెప్పి చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీటింగ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఆపివేసే అవకాశాలున్నాయని తెలంగాణ బీజేపీ నేత ఎస్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version