అర్థరాత్రి ఇంట్లోకి దూరి.. వివాహితపై అత్యాచారం..

-

ఎన్ని చట్టాలు చేసినా.. కఠిన శిక్షలు వేసిన మృగాళ్లల్లో మార్పు రావడం లేదు. తమ కామ వాంఛ తీర్చుకోవడానికి.. అడ్డదారులు తొక్కుతున్నారు.. వారి కోరిక కోసం మరొకరి జీవితాలను నాశనం చేస్తున్నారు. అలాంటి ఘటనే.. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని ముల్కనూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో ఆ వివాహిత కిరాణాషాపు నడుపుతోంది. ఆమె భర్త క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే.. అదే గ్రామానికి చెందిన కరుణాకర్‌ అనే యువకుడు రెండేళ్లుగా ఆమెతో ప్రత్యక్షంగానూ, ఫోన్‌లోనూ అసభ్యకరంగా మాట్లాడుతుండేవాడు. ఈ విషయమై పలుమార్లు పంచాయితీ పెట్టించగా, ఇక ముందు అలా మాట్లాడనని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకునేవాడు సదరు యువకుడు. ఆ తరువాత అలాగే ప్రవర్తించేవాడని, అయితే.. భర్త ఇంట్లో లేకపోవడాన్ని గుర్తించి అర్ధరాత్రి 12 గంటల సమయంలో కరుణాకర్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. అరిస్తే భర్తను, పిల్లలను చంపేస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version