టచ్ లో ఉన్న ఆ 40 మంది ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టండి – కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి

-

టచ్ లో ఉన్న ఆ 40 మంది ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టండని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు వైసీపీ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. దాదాపు 40 మంది వైకాపా ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆంబోతు అచ్చం నాయుడు కు మెదడులో తెలివి లేదు గాని మోకాల్లో ఉందన్నారు.

వైసీపీ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

దేనికి పనికిరాని దద్దమ్మ అచ్చం నాయుడు…ధైర్యం ఉంటే టచ్ లో ఉన్న 40 మంది ఎం.ఎల్.ఏ. ల పేర్లు
పేర్లు బయట పెట్టండని సవాల్‌ చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడే మైండ్ గేమ్ అని.. ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారంటూ ఒక పెద్ద నాటకానికి తెరతీస్తున్నారని ఆగ్రహించారు. డబ్బుకు అమ్ముడుపోయిన ఇద్దరు వెళ్లిపోయారు… చెరో పది కోట్లు తీసుకుని తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు…మాది రాజకీయ కుటుంబమైనా జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచామని తెలిపారు వైసీపీ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version