పిన్నితో రాసలీలలు.. చినాన్నకు తెలిసి..

-

వివాహేతర సంబంధం ఏనాటికైనా ప్రమాదమే.. అందుకు నిదర్శనం ఈ ఘటన.. ఓ యువకుడు తన చిన్నాన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చివరికి విగతజీవిగా కనిపించాడు. అయితే.. ఊరి పొలిమేర్లలో ఒక యువకుడి శవం కనిపించడంతో ఆ ఊరి జనాలంతా షాకయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడిని కుశాల్ మేఘారామ్‌గా గుర్తించారు. అతని శవానికి పోస్టుమార్టం చేయబోతుంటే.. గ్రామస్థులు ఒప్పుకోలేదు. ఆస్పత్రి ముందు ధర్నాకు కూర్చున్నారు. కుశాల్‌ను ఎవరో హత్య చేశారని కాబట్టి పోస్టుమార్టం తప్పనిసరి అని పోలీసులు నచ్చజెప్పడంతో గ్రామస్థులు వెనక్కి తగ్గారు.

Illegal Affair Leads to two suspected deaths in west godavari district  పశ్చిమ గోదావరి జిల్లాలో వివాహిత, యువకుడి అనుమానాస్పద స్థితి.. వివాహేతర  సంబంధమే కారణమా..?– News18 Telugu

పోస్టుమార్టం అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. ఇదంతా వివాహేతర సంబంధం కారణంగానే జరిగినట్లు తెలిసింది. మృతుడు కుశాల్ తన బాబాయ్(తండ్రి సోదరుడు) ఇంట్లో లేని సమయంలో కుశాల్ వచ్చేవాడని, అతనికి తన పిన్ని(బాబాయ్ భార్య)తో వివాహేతర సంబంధం ఉందని తేలింది. ఈ విషయం తెలిసిన బాబాయ్ డాలూరామ్ తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. కుశాల్‌ను తీవ్రంగా కొట్టి చంపేశాడు. తీవ్రమైన గాయాల కారణంగా అతను చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చి ఊరి చివర పడేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో వెలుగు చూసింది. హత్య కేసులో డాలూరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారణ చేస్తున్నామని, కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news