30 రూపాయలు అడిగినందుకు చిరు వ్యాపారిని హత్య చేసిన యువకులు..

-

సమాజంలో రోజురోజుకూ విలువలు పతనం అవుతున్నాయి. చిన్నచిన్న కారణాలకే అవతలి వ్యక్తులపై కోపం పెంచుకుంటున్నారు. కావాలని గొడవలు పెట్టుకుని ఏకంగా ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో రూ. 30 అప్పు తిరిగి ఇవ్వాలని అడిగితే కొందరు బరితెగించారు. ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి హత్య చేశారు. ఈ దారుణ ఘటన కు సంబంధించిన వివరాలు.. ఉత్తరప్రదేశ్ లోని టాండా ధాకి గ్రామంలో యశ్ పాల్(50) అనే వ్యక్తి కిరాణా దుకాణం పెట్టాడు. దాని ద్వారానే ఆయన జీవనోపాధి పొందుతున్నాడు. ఇటీవల అతడి వద్ద గ్రామానికి చెందిన భూపేంద్ర, యోగేంద్ర, ఆషి అనే ముగ్గురు యువకులు అతని వద్ద 30 రూపాయలు అప్పు పెట్టారు.

శనివారం రాత్రి వారు కనిపించగానే రూ. 30 అప్పు చెల్లించాలని యశ్ పాల్ అడిగాడు. దీంతో తమను అప్పు తిరిగి చెల్లించమన్నందుకు వారు ముగ్గురు ఆగ్రహంతో రగిలిపోయే గారు. యశ్ పాల్ తో గొడవకు దిగారు. వారి మధ్య వాగ్వాదం తీవ్రంగా జరిగింది. దీంతో కోపం పట్టలేని ఆ ముగ్గురు అతడిని కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. వారి దెబ్బలకు తాళలేక యశ్ పాల్ స్పృహ తప్పాడు. వెంటనే అతడిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు కుటుంబసభ్యులు హుటాహుటిన తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. నిందితులపై కేసు నమోదు చేశామని, వారికోసం గాలింపు చేపట్టామని ఏఎస్పీ రామ్ ఆర్జ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news