Breaking : జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ దర్యాప్తు.. వైఎస్ భారతి ఆస్తుల అటాచ్

-

జగన్ ఆస్తుల కేసులకు సంబంధించిన ఛార్జ్ షీటులో ఆయన భార్య భారతి పేరును ఈడీ చేర్చింది. భారతీ సిమెంట్స్‌కు సంబంధించి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీటులో ఆమెను ఏ5గా చేర్చింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలైంది. అయితే.. తాజాగా.. వైఎస్ భారతి ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం రాయదుర్గంలోని భూమి, సండూర్ షేర్లను జప్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.

YS Jagan and YS Bharathi the partners of Saraswati Power" TDP brings in  strong proofs! - TeluguBulletin.com

సిలికాన్ బిల్డర్స్, భగవత్ సన్నిధి భూములు, భవనాలు, రేవా ఇన్ ఫ్రా భూములు, భవనాల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. భూమి, షేర్లకు సమాన విలువ కలిగిన ఫిక్స్ డ్ డిపాజిట్లను అటాచ్ చేయాలని పేర్కొంది. ఫిక్స్ డ్ డిపాజిట్లు తీసుకుని బెంగళూరులోని భూములు విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. అయితే అటాచ్ చేసిన రూ.14.29 కోట్లను తిరిగివ్వాలని వైఎస్ భారతి చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news